ఏపి ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
అమరావతి: ఆగస్టు 1వ తేదీలోపు జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) బకాయిలు చెల్లించకపోతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఏపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హైకోర్టు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఇవాళ హైకోర్టు ఉపాధి హామీ పథకం బిల్లుల పెండింగ్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసు విచారించింది. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని ఏపి హైకోర్టు నిలదీసింది. వాదనల తరువాత రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.