ఆగస్టు 16 నుంచి స్కూళ్లు: మంత్రి సురేష్
అమరావతి: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
ఇవాళ విద్యాశాఖలో నాడు- నేడు పై ముగిసిన సిఎం వైఎస్ జగన్ సమీక్షించారి మంత్రి సురేష్ తెలిపారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. జూలై 15 నుంచిఆగస్టు 15వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న ఆగస్టు15లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారన్నారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందన్నారు. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదన్నారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సిఎం ఆదేశించారని వివరించారు. 30శాతం పదోతరగతి, 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామన్నారు. ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి సురేష్ అన్నారు.