ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దు : కేసీఆర్
తెలంగాణలో కుండపోత వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంత ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ సూచించారు . వాగులు , వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందన్న కేసీఆర్ .. వెంటనే NDRF బృందాలను అక్కడికి పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు . ప్రజలకు ఆటంకాలు కల్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు .