ఏపిలో ఐపిఎస్ ల భారీ బదిలీలు
అమరావతి: రాష్ట్రంలో 16 మంది ఐపిఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం ఎస్పి గా ఎం.దీపిక, సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పి, ఎం.రవీంద్రనాథ్ బాబును తూ.గో. జిల్లా ఎస్పి గా, కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్, పి.జగదీష్ ను విశాఖపట్నం జిల్లా పాడేరు సహాయ ఎస్పీ, జి కృష్ణకాంత్ను తూర్పుగోదావరి జిల్లా చింతూర్ సహాయ ఎస్పి, వి.ఎన్.మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పి, కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీ, తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.
విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి దిశా డిఐజి గా నియమించారు. అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్గా, రిశాంత్రెడ్డి గుంటూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పి, సతీశ్కుమార్కు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పి, విద్యాసాగర్ నాయుడు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పి, వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పి (అడ్మిన్), ఎస్.సతీష్ కుమార్ ను ఎస్ఈబి అదనపు ఎస్పి, విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబి అదనపు ఎస్పి, గరికపాటి బిందు మాధవ్ను ఎస్ఈబి అదనపు ఎస్పి, తుహిన్ సిన్హాను ఎస్ఈబి అదనపు ఎస్పి గా బదిలీ చేశారు.